Tuesday, December 27, 2016

కీళ్లు, మోకాళ్ల మధ్య అరిగిపోయిన జిగురులాంటి పదార్థం తిరిగి పెరుగుతుంది.. ఎలా???

1)                        
                                     రోజురోజుకి మారిపోతున్న ఈ కాలంలో లేచినప్పటి నుండి వివిధ రకాల ఒత్తిడిలతో సతమతమవుతూ ఎప్పుడు తింటామో, ఎప్పుడు నిద్రపోతామో కూడా సరిగా తెలియదు, దానితో వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి, ఈ కాలంలో ఎక్కువమంది సరియైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా ఎముకలు బలహీనంగా అవుతున్నాయి, అందువల్ల నడుం నొప్పి, కీళ్ల నొప్పులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పని అయిన చేయగలుగుతాం.
మన శరీరంలో ఎముకలలో కాల్షియం తగ్గిపోయి బలహీనంగా అయ్యాయి అని తెలిస్తే వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి కెమికల్స్ తో కూడిన కాల్షియం ట్యాబ్లేట్ ని వేసుకుంటాం వాటివల్ల వేరే రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ పూర్వ కాలంలో ఎముకలని బలంగా చేయడానికి కెమికల్స్ తో కూడిన ట్యాబ్లేట్స్ అంటూ ఏమి లేవు, సహజంగా దొరికే పదార్థాలతోనే వారు ఎముకలని బలంగా చేసుకునేవారు, అందుకే వారు చాలా బలంగా ఉండి ఎక్కువకాలం ఆరోగ్యంగా బతికేవారు, వారు అప్పుడు ఉపయోగించిన పద్ధతినే ఇప్పుడు ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతున్నారు, ఈ పదార్థాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.


కావాల్సిన పదార్థాలు:
  • 50 గ్రాముల గోధుమరవ్వ
  • 50 గ్రాముల పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు(Sun flower seeds)
  • 3 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
  • 3 టేబుల్ స్పూన్ల నువ్వులు
  • 50 గ్రాముల గుమ్మడికాయ గింజలు
  • 1 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు
  • ఒక కిలో తేనె

తయారు చేయు విధానం:

ముందుగా స్వచ్ఛమైన తేనెని తీసుకోని ఒక పెద్ద గిన్నెలో పోయాలి, దానిలో నువ్వులు, అవిసె గింజలు, ఎండు ద్రాక్షలని వేసి బాగా కలపాలి, ఆ తరువాత గోధుమ రవ్వని, పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలని వేసి బాగా కలపాలి, బాగా కలపగా వచ్చిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కు ముందు ఒక టీస్పూన్ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల కాల్షియం పెరిగి ఎముకలు గట్టిపడతాయి. దీంతోపాటు కీళ్లు, మోకాళ్ల మధ్య అరిగిపోయిన జిగురులాంటి పదార్థం తిరిగి పెరుగుతుంది. మజిల్, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.

____________________________________________________________________________________

2)
                                                       మనవ శరీరంలో ప్రతి భాగం ఎముకతో ముడిపడి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయం. ఒక మనిషి తన ఎదుగుదలలో 30 సంవత్సరాల వరకు ఎముకల ఎదుగుదల ఉంటుంది. ఆ తరువాత ఎముక పెరగటం ఆగిపోతుంది. మన శరీరంలో పాత ఎముకలు పాడైన కొద్ది కొత్త ఎముకలు వస్తుంటాయి. అలాగే వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఎముకలు చాలా బలహీనపడుతుంటాయి. అందులో ఆడవారికి ఎక్కువగా ఈ సమస్య జరుగుతుంటుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా ఎముకలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఎముకలు బలహీన పడటం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ఇక ఏ పని చేయలేరు. అందుకే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. వీటన్నింటికీ పరిష్కారంగా వైద్య నిపుణులు ఎముకల బలాన్ని పెంచుకొనేందుకు ఒక పద్దతిని మనకు ఒక డ్రింక్ పద్దతిలో తెలియజేస్తున్నారు. ఈ డ్రింక్ ని వరుసగా 15 రోజులపాటు తీసుకొంటే ఎముకలు ఉక్కు లాగా గట్టిపడతాయని చెపుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

డ్రింక్ తయారీకి కావలసినవి:
  • తేనె 2 టేబుల్ స్పూన్లు
  • నువ్వులు 1 టేబుల్ స్పూన్
  • గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్
ఇలా చేయాలి:
తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలను సరైన మొతాదులో తీసికొని గ్రైండ్ చేసుకోవాలి.ఓ కప్పు వేడిపాలలో ఈ మిశ్రమాన్ని కలపాలి. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి.
ఈ మిశ్రమంలో కాల్షియం అధికంగా ఉంటుంది. విటమిన్ డి, ఇతర మినరల్స్ అధికంగా శరీరానికి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ ఫెక్షన్లు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.ఒక్క సారి మీరు ఈ పద్దతిలో తయారు అయిన డ్రింక్ ని తాగి చూడండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి.


No comments:

Post a Comment