Wednesday, September 23, 2015

Tip of the Day - త్రాగు నీరు.










త్రాగు నీరు. 

మనం త్రాగేనీరు శుబ్రంగా ఉండాలి అని అందరం అనుకుంటూ ఉంటాము . కాని మనకు తెలియకుండానే మనం సుబ్రమైన నీరు అని తాగే నీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా !
!!!!!
        ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే!


భారతదేశంలో ఉన్న మన పూర్వికులు 

కొన్ని సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం 

కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో 

ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, 

ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. 

మరో ముక్యమైన పాత్రలు మట్టితో చెసెవి. మట్టి పాత్రలో నీరు చాల శుబ్రంగా 

ఉంటాయి . మట్టి పత్రాలు అంటే కుండ లాంటివి... వీటిని వాడటం వలన 

నీటిలో ఉండే కొన్ని సూక్ష్మక్రిములు చనిపోతాయి. నీరు కూడా 

పరిసుబ్రమవుతుంది...  

        ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ 

పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక 

సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి 

పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత 

పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం 

నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు 

అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.

ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని 

వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం 

కదా.కనుక మట్టి , రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని 

కాపాడుకోండి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ తెలియచేయండి...


ఈ విషయాన్ని మీరు కూడా నలగారికి షేర్ చేయ గలరు........ 




దన్యవాదములు...

సంతోషం..... 

No comments:

Post a Comment